హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో యాక్షన్ చేసే మహా నాయకుడు వస్తారు. మీ మధ్య చేరి నటిస్తారు. పథకాల వర్షాలు కురిపిస్తారు. నమ్మితే మోసపోవడం ఖాయం, ఎన్నికల్లో గెలవడం కోసం ఎలాంటి హామీలు ఇవ్వడానికైనా వెనుకాడరు అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రజలకు సూచించారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన వ్యక్తి జమ్మికుంటలో వరద కోసం శాశ్వత పరిష్కారంచూపలేని నాయకుడు మనకు అవసరమా? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను లేచి మరిచిపోయే నాయకులు మనకు అవసరమా? అని కౌశిక్ ప్రశ్నించారు. “మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. ఒక్క అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని” పేర్కొన్నారు.