రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 10 వేలకు పైగా ఇండ్లను మూసీ నది ఒడ్డున దుర్భర పరిస్ధితుల్లో నివసిస్తున్న పేద ప్రజలకు అందించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా కోరారు. అత్యంత పేదరికం వలన మూసీ నది పక్కన దుర్భరమైన స్థితిలో జీవనం సాగిస్తున్న వీరందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
నగరంలో గత పది సంవత్సరాలలో జరిగిన విస్తృతమైన అభివృద్ధి పట్ల ప్రజలు అత్యంత సంతృప్తిగా ఉన్నారన్న నివేదికలు తమ దగ్గర ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు అడగాలని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు నొక్కి చెప్పారు.