Lavu Srikrishna Devarayalu | తెలుగుదేశం పార్టీలో మరో చేరికకు రంగం సిద్ధమైంది. నరసరావుపేట MP లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. పార్టీలో చేరిక, నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడంపై చంద్రబాబు బాబుతో చర్చిస్తున్నట్లు తెలుస్తుంది.
అధికార వైసీపీ పార్టీ నరసరావుపేట లోక్సభ సీటును ఈసారి బీసీలకు కేటాయించనున్న నేపథ్యంలో లావు శ్రీకృష్ణదేవరాయలుకు ప్రత్యామ్నాయం సూచించగా ఆయన అందుకు తిరస్కరించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలోకి వస్తున్నప్పటికీ, తాను నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని తెలిపారు.
Also Read | TDPలో చేరిన YCP MLA కొలుసు పార్థసారథి..!