Home   »  రాజకీయం   »   అమిత్ షా విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్

అమిత్ షా విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్

schedule raju

ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతు గోస.. బీజేపీ భరోసా” బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి అమిత్ షా. బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. తమకు నూకలు చెల్లడం కాదని.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని విమర్శించారు.

సరిగ్గా బ్యాట్ పట్టుకోవడం కూడా చేతకాని మీ అబ్బాయికి బీసీసీఐలో కీలక పదవి ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. అమిత్ షా.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం.. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’’ అని హరీష్‌రావు విమర్శలు గుప్పించారు.

పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే.. కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపసంహరించుకుని తోకముడిచిన మీరా రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శించేది అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. 2జీ 3జీ 4జీ కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నాజీలను మించిన నియంతృత్వ పాలన మీది. రాబోయే ఎన్నికల్లో మీరు మాజీలే. సీఎం పదవి కాదు. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించాలంటూ హరీశ్ రావు సవాల్ విసిరారు.