పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పట్ల అమర్యాదగా మాట్లాడారని, క్షమాపణ చెప్పాలని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడమే తన ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు.
జగన్ ని ఎవరూ ఏమీ చేయలేరని, ప్రజలు తన వెంటే ఉన్నారని పోసాని అన్నారు. పవన్ కు ఏమైనా నైతిక విలువలు ఉంటే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని సూచించారు.
ఇక సినీ పరిశ్రమలో మహిళలను అవమానించే వారిపై పవన్ ఎందుకు స్పందించడం లేదని పోసాని ప్రశ్నించారు. సినీ పరిశ్రమని వదిలేసి రాజకీయాల మీద పడ్డారని అన్నారు.
భీమవరంలో పవన్ TDP చేతిలో ఓడిపోయారని చెప్పిన పోసాని. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.