Home   »  రాజకీయంవార్తలు   »   మహారాష్ట్ర లో బహిరంగ సభ : కేసీఆర్

మహారాష్ట్ర లో బహిరంగ సభ : కేసీఆర్

schedule sirisha

మహారాష్ట్ర: BRS ను జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఆయన ఇప్పటికే ఆ రాష్ట్రంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. మహారాష్ట్రలోని దేవాలయాలను సందర్శిస్తున్నారు.

కేసీఆర్ చివరిసారిగా దాదాపు 600 వాహనాల కాన్వాయ్‌తో మహారాష్ట్ర కు వెళ్లడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్ర రాజకీయాల్లో BRS ఉనికిని పెంచేలా ఆయన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆయన మరోసారి మహారాష్ట్ర వెళ్లారు. అనంతరం సాంగ్లీ జిల్లాలోని వాటేగావ్ చేరుకుని అక్కడ సామాజిక కార్యకర్త అన్నాబాపు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

అన్న బాపు ఎన్నో సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అలాగే అన్న బాపు కుటుంబసభ్యులతో పాటు పలువురు BRSలో చేరనున్నట్లు తెలిపారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు.