గుంటూరు: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 350 లోక్సభ స్థానాలు గెలుచుకుని కేంద్రంలో BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ప్రధానాంశాలు
గుంటూరు: రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారాన్ని, మోదీ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ప్రజలలోకి తీసుకువెళ్ళేందుకు చేపట్టిన “ప్రజాపోరు” యాత్రలో భాగంగా గుంటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు.
మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పేదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు: Purandeswari
ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 350 సీట్లు వస్తాయని అన్నారు. మోదీది నిరుపేద కుటుంబమని, అందుకే ప్రభుత్వ కార్యక్రమాల్లో పేదలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో AP రాష్ట్ర రుణాలు రూ.12 లక్షల కోట్లకు చేరాయని, AP సచివాలయాన్ని రూ.350 కోట్లకు తాకట్టు పెట్టే హక్కు ప్రభుత్వానికి లేదని ఆమె విమర్శించారు.
ఉపాధి కల్పనలో పరిశ్రమలను ఆకర్షించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది: పురంధేశ్వరి
ఉపాధి కల్పనలో పరిశ్రమలను ఆకర్షించడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఫలితంగా చదువుకున్న యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని పురంధేశ్వరి అన్నారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ..ఉద్యోగులకు మొదటి వారంలో జీతాలు ఇచ్చే పరిస్థితిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేదని విమర్శించారు. ఇతర నియోజకవర్గాల్లోని చెత్తను గుంటూరు వెస్ట్కు తరలించేందుకు వైఎస్సార్సీపీ కృషి చేస్తుందన్నారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బీజేపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ మకుటం శివ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర, పార్టీ నాయకులు రామకృష్ణారెడ్డి, వల్లూరు జయప్రకాష్నారాయణ, డాక్టర్ సనక్కాయల ఉమాశంకర్, తులసీ రామచంద్ర ప్రభు తదితరులు పాల్గొన్నారు.