హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి(Rajasekhar Reddy)ని వివిధ కార్మిక సంఘాల నేతలు కలుసుకుని సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఉద్యోగ సంఘాల నాయకులతో జరిగిన సమావేశంలో మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉత్సాహంగా కృషి చేయాలని కోరారు. భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు సంబు ప్రభాకర్ మాట్లాడుతూ.. మర్రి రాజశేఖర్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడి అన్ని వర్గాల ప్రజలకు చేరువైన ప్రజా నాయకుడని అభివర్ణించారు.
Rajasekhar Reddy గెలుపు కోసం అన్ని సంఘాలు కృషి చేయాలి: సంబు ప్రభాకర్..
కోవిడ్ మహమ్మారి సమయంలో బాధిత వర్గాలకు మర్రి రాజశేఖర్ రెడ్డి అందించిన సహాయాన్ని, సేవలను గుర్తు చేశారు. ఆయన గెలుపు కోసం అన్ని సంఘాలు కృషి చేయాలని సంబు ప్రభాకర్ కోరారు. రాజయ్య, వీఎల్ఎన్ చారి, సిరాజుద్దీన్, సంతోష్ కుమార్, నగేష్తోపాటు పలువురు నాయకులు కార్యక్రమంలో ఫహీముద్దీన్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.