ప్రధానాంశాలు..
హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ (YSRTP) కాంగ్రెస్లో విలీనం కానందున వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ షర్మిల (Sharmila) పోటీ చేయనున్నారు.
హైదరాబాద్లో YSRTP నాయకుల సమావేశం..
పోటీ చేసే సీట్ల సంఖ్యపై నిర్ణయం తీసుకోవడానికి మరియు ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి షర్మిల గురువారం హైదరాబాద్లో వైఎస్ఆర్టిపి (YSRTP) నాయకులను సమావేశానికి పిలిచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వైఎస్ఆర్టిపి పార్టీ 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం..
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గానూ YSRTP పార్టీ 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత, అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి (YSR) కుమార్తె షర్మిల పాలేరు, మిర్యాలగూడ స్థానాల్లో పోటీ చేయవచ్చు. ఆమె తల్లి వై.ఎస్. విజయమ్మ కూడా సికింద్రాబాద్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్కు వెళ్లేది లేదు : Sharmila
ఆంధ్రప్రదేశ్లో పార్టీని నడిపించే బాధ్యతను షర్మిల తీసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టడంతో వైఎస్ఆర్టీపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. అక్కడ ఆమె సోదరుడు Y.S జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. తెలంగాణలో తన రాజకీయ జీవితాన్ని నిర్మించుకోవాలనే పట్టుదలతో ఉన్నందున ఆంధ్రప్రదేశ్కు వెళ్లేది లేదని కాంగ్రెస్ అధిష్టానానికి షర్మిల స్పష్టం చేశారు.
షర్మిల 2021లో వైఎస్ఆర్టీప పార్టీని స్థాపించారు..
కాగా, తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడని తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డితో విభేదిస్తూ, షర్మిల 2021లో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేపట్టారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత మే లో వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే చర్చ మొదలైంది.
ఆగస్టు 31న న్యూఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన షర్మిల.. విలీనానికి ప్రతిఫలంగా పార్టీలో కీలక పదవితోపాటు 15 అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. A.I.C.C ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకోవాలని ఆమె ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అంతకుముందు, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్తో షర్మిల రెండుసార్లు సమావేశమయ్యారు. అయితే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ అయినా విలీన చర్చల్లో పురోగతి లేదు.