ప్రధానాంశాలు
హైదరాబాద్ : పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్లో T.హరీశ్రావు సమక్షంలో (BRS)బీఆర్ఎస్లో చేరారు.
పలువురు కాంగ్రెస్ నేతలను BRS పార్టీలోకి ఆహ్వానించిన హరీశ్ రావు.
టీపీసీసీ మాజీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, A.S రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీషారెడ్డి, రవికుమార్ ముదిరాజ్, బిత్తిరి సత్తితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం తెలంగాణ భవన్లో టీ.హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నాయకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా హరీశ్ రావు ఆహ్వానించారు.
తెలంగాణ ప్రజలు తమకు K.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో బలమైన నాయకత్వం కావాలో లేదా కాంగ్రెస్ నేతృత్వంలో బలహీనమైన నాయకత్వం కావాలో ఎన్నుకోవాలని హరీశ్రావు కోరారు.
బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది : హరీశ్రావు
ఒకవైపు బలమైన నాయకుడు కే చంద్రశేఖర్ రావు, మరోవైపు ఎవరైనా నాయకుడు అందుబాటులో ఉన్నారా? అని ఆయన ప్రశ్నించాడు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్, బీఆర్ఎస్లు హ్యాట్రిక్ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు.