పాలమూరు: డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై కేసీఆర్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా బిజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చేపట్టిన పోరుబాట. తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం పై మండిపడుతూ ఈ రోజు ఉదయం11:00 గంటలకు పాలమూరులో బహిరంగ సభ ప్రారంభించారు.
తెలంగాణ BJP సీనియర్ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీని నెరవేర్చే వరకూ మా ఈ పోరాటం ఆగదు అడుగైనా ముందుకు పడనీ ఇళ్ల హామీలు అంటూ కిషన్ మొదలుపెట్టారు. సభ అనంతరం ర్యాలీ చేయనున్నట్లు తెలిపారు.
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంటున్న డబ్బును మహారాష్టలో BRS పార్టీ పేరు మీద పంపిణీ చేస్తోందని ఆరోపించారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ జరగలేదని, రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.