మంగళగిరి: శ్రీకాళహస్తి ఆలయం ఆవరణలో పురావస్తు, ధర్మాదాయ శాఖ మార్గదర్శకాలను పూర్తిగా విస్మరించి తవ్వకాలు చేపట్టేందుకు యత్నించడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) తీవ్రంగా ఖండించారు.
ప్రధానాంశాలు
ప్రమాదకర తవ్వకాలకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి: Nara Lokesh
“ప్రఖ్యాత మరియు చారిత్రక ఆస్తులను పాడుచేయడం నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా అనైతిక చర్య” అని లోకేష్ అన్నారు మరియు అటువంటి ప్రమాదకర తవ్వకాలకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి గుడి ఆవరణలో పాపాలకు పాల్పడుతున్నారు: లోకేష్..
చేసిన పాపాలు పోవాలని, సన్మార్గంలో నడిచేలా దీవించాలని భక్తులంతా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటారు. కానీ అధికారమదం తలకెక్కిన Y.S.R.C.P ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాత్రం శ్రీకాళహస్తి సన్నిధిలోనే పాపాలకు పాల్పడుతున్నారని నారా లోకేష్ ఆరోపించారు. పురాతన ఆలయ ఆవరణలో స్వామివారికి, అమ్మవారికి పవిత్ర ప్రసాదాలు, మృత్యుంజయ పూజలు నిర్వహించే గదులను ఎమ్మెల్యే కూల్చివేస్తున్నారని నారా లోకేష్ తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో తవ్వకాలకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని X పోస్టులో తెలిపారు.
ALSO READ: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తా: రజిని