Home   »  రాజకీయం   »   భూపాలపల్లి లో మొదలైన కారు జోరు..

భూపాలపల్లి లో మొదలైన కారు జోరు..

schedule mounika

భూపాలపల్లి లో మొదలైన కారు జోరు… గులాబీ గూటికి మొదలైన చేరికల తీరు… ఎమ్మెల్యే సమక్షంలో బి ఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ వార్డ్ సభ్యులు.. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నిలుపుతున్న భారత రాష్ట్ర సమితి పార్టీలో పని చేయాలని ముందుకు వస్తున్న రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బిజెపి ముఖ్య నాయకులను స్థానిక నాయకులు ఆధ్వర్యంలో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ చేరారు. ఈ మేరకు వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.

పార్టీలో చేరిన వారి వివరాలు: కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు గుర్రాల ఉగేందర్, పగడాల సదానందం, నాగపూరి రఘు మరియు రామాలయం గుడి ఆలయ కమిటీ చైర్మన్, బీజేపీ సీనియర్ నాయకులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తోట సమ్మయ్య, పిట్ట రజినీకాంత్, కొండ స్వామి, దూలం చందు తదితరులు చేరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పన్నాటి శ్రీనివాస్,మాజీ సర్పంచ్ పంచగిరి బాబురావు, గ్రామ శాఖ అధ్యక్షుడు పంచగిరి సుధాకర్, సోషల్ మీడియా కన్వీనర్ సర్వు రాజు,రవి, పంచగిరి భద్రయ్య, రూపిరెడ్డి చంద్ర రెడ్డి, మంచిపెళ్లి రజినీకాంత్, రాగుల రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.