Home   »  రాజకీయం   »   ఏకంగా దేశం పేరు ను మార్చనున్న కేంద్రం…?

ఏకంగా దేశం పేరు ను మార్చనున్న కేంద్రం…?

schedule mahesh

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ఏకంగా దేశం పేరు మార్పుకు సిద్దమైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న INDIA పేరును BHARAT గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారని తెలుస్తోంది. ప్రతిపక్షాలు NDA కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారికి వ్యతిరేకంగా మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏకంగా దేశం పేరు మార్పు సిద్దమైందని తెలుస్తోంది.

రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో అధికార BJP పార్టీ జమిలి ఎన్నికలు, ఇండియా పేరు మార్పు లాంటి కీలక బిల్లులని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. వీటిని ప్రతి పక్ష, INDIA కూటమి ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.