ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్కు చెందిన అనుజ్ చౌదరి అనే 30 ఏళ్ల భారతీయ జనతా పార్టీ (BJP) నేత ను గురువారం సాయంత్రం తన ఇంటి ముందే కాల్చి చంపారు. చౌదరి తన అపార్ట్మెంట్ సమీపంలో కారు దిగి ఇంట్లోకి వస్తుండగా గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించాడు.
మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమిత్ చౌదరి, అనికేత్ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మొరాదాబాద్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) హేమ్రాజ్ మీనా తెలిపారు. చౌదరి మృతికి రాజకీయ ప్రత్యర్థులపై ఆయన కుటుంబం నిందలు వేసింది.
పోలీసులు వివరాల ప్రకారం రెండు పార్టీల మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తినట్లు తెలిపారు. నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.