తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అవినీతిలో పోటీ పడుతున్నాయని, రాష్ట్ర అప్పులు పెరిగిపోతున్నాయని, అరాచక ప్రభుత్వాన్ని నడుపుతు, తెలుగు రాష్ట్రాలను లూటీ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. తెలంగాణ CM కే చంద్రశేఖర్రావు మద్యం(లిక్కర్) లైసెన్స్ల దరఖాస్తులపైనే రూ.2,500 కోట్లు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వంపై మండిపడ్డ బండి సంజయ్.
లిక్కర్ బాండ్లను అందజేసేందుకు తాగుబోతులకు రుణాలు అందజేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. దశలవారీగా మద్య నిషేధం తీసుకొస్తామని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఏమైంది ఇచ్చిన మాట మరిచిన AP అని ఆయన విమర్శించారు. కాని తెలంగాణకు మాత్రం లిక్కర్ నుండి 4% ట్యాక్స్ రూపంలో వస్తున్నందున వారికి లైసెన్స్లు ఇచ్చి మరి ప్రోత్సహిస్తుంది.