Home   »  రాజకీయం   »   కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో చోటు దక్కించుకున్న ఉత్తమ్ కుమార్

కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీలో చోటు దక్కించుకున్న ఉత్తమ్ కుమార్

schedule mahesh

న్యూఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మళ్లికార్టున్‌ ఖర్గే 16 మంది సభ్యులతో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (CEC)ని ఏర్పాటు చేశారు. ఈ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ లో తెలంగాణ నుండి ఉత్తమ్‌కు చోటు దక్కింది.

ఈ కమిటీలో సభ్యులుగా ఖర్గే తో పాటు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌,అంబికా సోని, అధిర్‌ రంజన్‌ చౌదరి, సల్మాన్‌ ఖుర్షిద్‌, మధుసూదన్‌ మిస్తీ, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, TS సింగ్‌ దేవ్‌, కేజే జార్డ్‌, ప్రీతమ్‌ సింగ్‌, మహమ్మద్‌ జావేద్‌, అమీ యాజ్జిక్‌, పీఎల్‌ పూనియా, ఓంకార్‌ మార్కం ఉన్నారు.