మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanti) మరోసారి టిఆర్ఎస్ పార్టీపై… ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు పై బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.
మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanti) సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్..
బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద విజయశాంతి సానుభూతి ప్రకటించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఆడబిడ్డ అయినా సరే నిర్దోషులుగానే ఎప్పుడు నిలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి పేర్కొన్నారు.
ఈడీ నోటీసులు ఇప్పుడు పంపడం, కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత అన్న మాటలను విజయశాంతి తప్పుపట్టారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్టు బిజెపికి రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఆమె అరెస్ట్ కావాలని కోరుకోవడం బీజేపీకి అవసరమేం లేదన్నారు.
దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అనేక సమస్యలపై చర్యలు తీసుకోవడానికి నిర్దేశించబడిన ప్రభుత్వ సంస్థలు ఈడి, సిబిఐ లు అన్నారు.
ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే..బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో BRS కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం BRS కు ఉందేమో గానీ.. జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు
కాగా, ఈ కేసులో నిందితుడుగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లై మొదట అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు.
ఇప్పుడు మళ్లీ అప్రూవర్ గా మారడం, న్యాయమూర్తి ముందు అరుణ్ రామచంద్ర పిల్లే వాంగ్మూలం ఇవ్వడం.. ఆ తర్వాత వెంటనే కవితకు ఈడి మరోసారి నోటీసులు పంపించడం వెంట వెంటనే జరిగిపోయాయి.
ఈడీ నోటీసులకు కవిత స్పందిస్తూ..
దీనిమీద కవిత స్పందిస్తూ ఇవి అంత ఏదో టీవీ సీరియల్ లాగా ఉందని… ఈడీ నోటీసులు కాదు, మోడీ నోటీసులు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు స్థితులు, రానున్న ఎన్నికల నేపథ్యంలోనే రాజకీయ లబ్ధి కోసమే నోటీసులు పంపారని కవిత చెప్పుకొచ్చారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు కల్వకుంట్ల కవిత హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.
అయితే ఈ రోజు విచారణకు తాను హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నారు. కవిత
సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో తాను వేసిన పిటీషన్ ను కొట్టివేసిన తర్వాతనే విచారణకు హాజరు కావాలని కవిత నిర్ణయించుకున్నారు.
అందుకే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుటకు తమ తరుపున న్యాయవాదులను కవిత పంపనున్నారు.
ఈ ఏడాది మార్చిలో నాలుగు రోజుల పాటు కవితను విచారించిన ఈడీ ఆమె గతంలో వాడిన 11 ఫోన్లను స్వాధీనం చేసుకుంది.
ఆ ఫోన్ల నుంచి కీలక డేటాను రిట్రీవ్ చేసినట్లు తెలిసింది. వాటిలో నుంచి ఆయా యాప్ల ద్వారా చేసిన చాటింగ్స్ను, డాక్యుమెంట్లను ఈడీ వెలికితీసి విశ్లేషించినట్లు సమాచారం. ఆ డేటాను కూడా కవిత ముందుంచి ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.