Home   »  రాజకీయంతెలంగాణవార్తలు   »   మైనార్టీ బంధు పథకం అమలుపై సంక్షేమశాఖ మంత్రి KCRకు ధన్యవాదాలు తెలిపారు

మైనార్టీ బంధు పథకం అమలుపై సంక్షేమశాఖ మంత్రి KCRకు ధన్యవాదాలు తెలిపారు

schedule sirisha

హైదరాబాద్: మైనార్టీలకు వంద శాతం సబ్సిడీతో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన సందర్భంగా ఈరోజు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి KCR ను మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వారితో పాటు ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ మతాల నేతలు పాల్గొన్నారు. వారిలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇంతియాజ్ ఇషాక్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మేడె రాజీవ్ సాగర్, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, తెలంగాణ మైనార్టీ నాయకులు బి. శంకర్ లూక్, ముస్సేన్ మదాని తదితరులు పాల్గొన్నారు.