తెలంగాణ: జనగామ బీఆర్ఎస్ లో వర్గపోరు కొనసాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీచేయాలని భావిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి విమర్శల జోరు పెంచారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అక్క జయప్రదకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలలు లాక్కొని…ఆమెను మానసిక వేదనకు గురి చేశావంటూ మండిపడ్డారు.
తాను ఎక్కడైనా భూకబ్జాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే ప్రాణత్యాగం సిద్ధమని విపక్షాలకు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ప్రజలకు సేవ చేయడమే నేర్పారు కానీ, భూ కబ్జాలు నేర్పలేదని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందర్నీ కలుపుకెళ్లేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుంటే.. బయట పార్టీల నుంచి వచ్చిన వారిని కుక్కలు నక్కలు అంటూ అవమానపరిచారన్నారు. వారితో పాటు సీఎం కేసీఆర్ను కూడా పల్లా అవమాన పరిచారన్నారు.