Home   »  రాజకీయం   »   భయంతోనే జమిలి ఎన్నికలు: హరీశ్ రావు

భయంతోనే జమిలి ఎన్నికలు: హరీశ్ రావు

schedule mounika

రాబోయే ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో పర్యటించిన ఆయన బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంపై బీజేపీ వివక్ష చూపుతోందని ఆరోపించారు. వారెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో అధికారంలోకి రాలేరని చెప్పారు. జమిలి ఎన్నికలకు మొగ్గు చూపుతున్న కేంద్రం అత్యవసరంగా సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నదని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.