Home   »  రాజకీయం   »   మల్కాజ్ గిరి MLAకు షాక్ కు ఇచ్చిన KCR….

మల్కాజ్ గిరి MLAకు షాక్ కు ఇచ్చిన KCR….

schedule sirisha

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మొత్తం 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. అయితే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రోహిత్‌ను మెదక్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధం చేసాడు. కానీ KCR వీరికి షాక్ ఇచ్చాడు.అయితే కుమారుడు టికెట్ విషయంలో మైనంపల్లి డిమాండ్ పార్టీ పట్టించుకోలేదు.

మరోసారి మెదక్ అసెంబ్లీ టికెట్‎ను పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. మల్కాజ్ గిరి లో తాను పోటీ చేస్తానని, మెదక్ లో తన కుమారుడిని ఖచ్చితంగా గెలిపించుకుంటానని హరీష్ రావు పై హనుమంతరావు విరుచుకు పడ్డాడు. ఇంతకాలం మెదక్ అభివృద్ధిని హరీష్ రావు అడ్డుకున్నారని అవసరమైతే తన తడాఖా ఏంటో చూపించి హరీష్ అడ్రస్ గల్లంతు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే హనుమంతరావు ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఆ ప్రకటనలో తన కొడుకు పేరు లేక పోవడంతో షాక్కు గురయ్యాడు.