Home   »  రాజకీయం   »   ఎమ్మెల్సీ కవితకు నోటీసులివ్వాలి: షబ్బీర్ అలీ

ఎమ్మెల్సీ కవితకు నోటీసులివ్వాలి: షబ్బీర్ అలీ

schedule mounika

తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో ఇటీవల సీఎం కేసీఆర్ కు మద్దతుగా సర్పంచ్ లు తీర్మానాలు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తప్పుబట్టారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడమేనని మండిపడ్డారు. కవిత కూడా వారిని సమర్థిస్తూ ట్వీట్ చేయడం సరికాదన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆయా గ్రామాల సర్పంచ్ లను ఉప సర్పంచ్ లను సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇవ్వాలన్నారు. తెలంగాణ ద్రోహులను కేబినెట్‌లో చేర్చుకోవడం కేసీఆర్ ముందస్తు ప్రణాళికలో భాగమేనని ఆయన తెలిపారు.