రాహుల్ గాంధీ(Rahul Gandhi) అప్డేట్ లేని ఔట్డేటెడ్ నాయకుడు అయిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) ఆరోపించారు.
బుధవారం నాడు కవిత మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మమూలు మనిషి కాదు. ఇలాంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు.
మన తెలంగాణకు అలాంటి నాయకుడు దొరికారు. తెలంగాణ ఉద్యమం కొనసాగించిన పార్టీనే అధికారంలోకి వచ్చింది అని కవిత తెలిపారు.
కాంగ్రెస్ అంటే అవినీతి.. ఆ పార్టీని దేశం రిజెక్ట్ చేసిందని, రేపట్నుంచి హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయని, ఇక గాంధీ పరివారం అంతా ఇక్కడికి వస్తోంది అని కవిత పేర్కొన్నారు.
మొన్న ఖర్గే వచ్చి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చారు. మేం వచ్చి పోడు పట్టాలు ఇస్తామంటున్నారు. అసలు వీళ్లు అప్డేట్ కారా..? మొన్ననే మనం పోడు పట్టాలు ఇచ్చేశాం.
రాహుల్ గాంధీ(Rahul Gandhi) అప్డేట్ లేని ఔట్డేటెడ్ నాయకుడు అయిపోయారు. ఆయనకు ఆలోచన లేదు. కేసీఆర్ స్పీడ్ను అందుకోలేరు.
రాహుల్ గాంధీ మోదీని ఆపలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీనే అని కవిత స్పష్టం చేశారు.
అవినీతికి మారుపేరుగా మారిన ఆ పార్టీని స్కాంగ్రెస్గా అభివర్ణిస్తుంటారు. అలాంటి స్కాంగ్రెస్ను 206 ఎంపీ సీట్ల నుంచి 44 సీట్లకు దించారు దేశ ప్రజలు.
పార్టీకి నాయకత్వం వహించలేక చేతులెత్తేసిన జాతీయనేత రాహుల్గాంధీ రూ.80 వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఖమ్మం సభలో ఆరోపించడం విడ్డూరం.
కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే.
పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప..ప్రజా సమస్యల పరిష్కారం అనే మాట కాంగ్రెస్ వాళ్లకు ఏనాడూ పట్టదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం.
అలాంటి పార్టీని జగిత్యాలలోనూ ఓడించాలి. తెలంగాణలో ఊహకందని అభివృద్ధి జరుగుతుంది. దీంతో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
కాంగ్రెస్ నేతల మాటలు విని మోసపోవద్దు. తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీ శ్రీరామరక్ష. కేసీఆర్ పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ ఉంది.