IND VS SA T20: T20 ఫార్మాట్లో తనదయిన ఆటతీరుతో దూసుకెళ్తున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ (Captain Suryakumar) గత రాత్రి సౌతాఫ్రికా తో జరిగిన రెండో T20 మ్యాచ్లో 155కి పైగా స్ట్రైక్ రేటుతో సూర్య 36 బంతుల్లోనే 56 పరుగులు చేసాడు.
ప్రధానాంశాలు
అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసి కోహ్లీ సరసన చేరిన captain Suryakumar
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 180 పరుగులు చేయడంలో సూర్య అత్యంత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో అతడు కెరీర్లో మరో కీలక మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ T20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు పూర్తి చేసుకున్న భారతీయ బ్యాట్స్మెన్గా సూర్య, కోహ్లీ సరసన చేరాడు. కేవలం 56 ఇన్నింగ్స్ల్లోనే సూర్య రెండు వేల రన్స్ చేసాడు.
56 ఇన్నింగ్స్లో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న సూర్యకుమార్
దీంతో కింగ్ విరాట్ కోహ్లీ రికార్డును సూర్య సమం చేయడం జరిగింది. విరాట్ కూడా 56 ఇన్నింగ్స్లో 2,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పుడు దానిని సూర్య సమం చేసాడు. కెరీర్లో కీలక మైలురాయిని చేరుకున్న కెప్టెన్ సూర్యకి BCCI అభినందనలు తెలియజేసింది.
ఇక అత్యంత వేగంగా రెండు వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాట్స్మెన్లలో K.L రాహుల్ మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు. రాహుల్ 58 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. రోహిత్ శర్మ 77 ఇన్నింగ్స్లలో రెండు వేల పరుగులు పూర్తి చేసాడు. ఇక అంతర్జాతీయంగా చూస్తే 2,000 పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న ఆటగాళ్లలో పాకిస్థాన్ బ్యాటర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానంలో వున్నారు. వీరిద్దరూ 52 ఇన్నింగ్స్ల్లోనే ఈ రికార్డును నమోదు చేసారు.