Home   »  క్రీడలు   »   DHONI | ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ధోనీ

DHONI | ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ధోనీ

schedule mahesh

అమెరికా: అమెరికా పర్యటనలో ఉన్న మహేంద్ర సింగ్ DHONI కి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి ఆహ్వానం అందింది.

దీంతో ట్రంప్‌ దగ్గరకు వెళ్లిన మహేంద్రుడు ఆయనతో కలిసి గోల్ఫ్ ఆడాడు.

అమెరికాలో జరుగుతున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లో కార్లోస్ అల్కరాజ్, అలెగ్జాండర్ జ్వెరేవ్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్‌ క్వారర్ట్ ఫైనల్స్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు.

టెన్నిస్ మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన DHONI ఒక రోజు తర్వాత భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ DHONI అమెరికా డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆటలో మునిగి పోయారు.

ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

ఇప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్న మహీకి ఇతర క్రీడల్లోనూ ప్రవేశం ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ గోల్ఫ్ ఆడాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో DHONI కలిసి గోల్ఫ్ ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఏడాది ప్రారంభంలో, ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రికార్డు స్థాయిలో ఐదవ ఐపిఎల్ టైటిల్‌ను సాధించింది.

అతను ఎడమ మోకాలి సమస్యతో చెన్నై కోసం మొత్తం IPL 2023 సీజన్‌ను ఆడాడు, అది కూడా భారీగా పట్టీతో ఉన్నట్లు గుర్తించబడింది.

IPL తర్వాత, ధోని ఎడమ మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీనిని ముంబై ఆసుపత్రిలో డాక్టర్ దిన్షా పార్దివాలా చేశారు.

ధోని వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్‌లో పాల్గొనే ముందు ధోని విదేశాలని చుట్టేస్తున్నాడు.

2023 IPL ఫైనల్ తర్వాత ధోనీ తన శరీరం అనుమతిస్తే అభిమానుల కోసం కనీసం ఒక సీజన్‌కైనా తిరిగి వస్తానని చెప్పాడు. ధోని వచ్చే ఏడాది IPL ఆడాలని ధోని ఫాన్స్ కోరుకుంటున్నారు.