Home   »  క్రీడలు   »   సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో హైదరాబాద్‌ ఐదో విజయం నమోదు

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో హైదరాబాద్‌ ఐదో విజయం నమోదు

schedule mahesh

న్యూఢిల్లీ : సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టీ20 టోర్నీలో హైదరాబాద్‌ (Hyderabad victory) ఆరు మ్యాచ్ ల్లో ఐదో విజయం సాధించింది. బుధవారం జరిగిన పోరులో హైదరాబాద్‌ 23 పరుగుల తేడాతో ముంబై జట్టును ఓడించింది.

మొదట హైదరాబాద్‌ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేయగలిగింది. తన్మయ్‌ అగర్వాల్‌ (59), రాహుల్‌ సింగ్‌ (37) రాణించడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ముంబై జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ముంబై కెప్టెన్‌ అజింక్య రహానే (24), యశస్వి జైస్వాల్‌ (16), శివమ్‌ దూబే (2), సర్ఫరాజ్‌ ఖాన్‌ (2) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రవితేజ 4 వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు