మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
India vs Australia: స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో మొదట రెండు మ్యాచ్ లు ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా నేడు జరిగే చివరి వన్డేలోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుంది. తొలి మ్యాచ్లో హర్మన్ సేన కంగారూలకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఇక నిర్ణయాత్మక రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి ఓటమిపాలయ్యారు. ఈ రోజు జరిగే మూడో వన్డేలో ఆ లోపాలను సరిదిద్దుకొని సమిష్టిగా సత్తాచాటాలని భారత జట్టు భావిస్తుంది. మరోవైపు ఇప్పటికే మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ రోజు మ్యాచ్ గెలిచి సిరీస్ ను క్లీన్స్వీప్ చేయాలని భావిస్తుంది. స్టార్ ప్లేయర్లతో నిండి ఉన్న కంగారూలను అడ్డుకోవాలంటే మన అమ్మాయిలు శక్తికి మించి పోరాడక తప్పదు.
నేడు India vs Australia మహిళల మూడో వన్డే
ఇక భారత స్టార్ ప్లేయర్స్ స్మృతి మంధాన, యాస్తికా భాటియా, జెమీమా, రిచా, హర్మన్, దీప్తి శర్మ, పూజా వస్త్రకార్ జట్టుగా రాణించాల్సివుంది. టెస్టు ఫార్మాట్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను వణికించిన మన బౌలర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నారు. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సిన అవసరం వుంది.
Also Read: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ హతం..!