ఆసియా కప్: ఆసియా కప్ లో భాగంగా నిన్న శ్రీలంక లోని పల్లెకెలె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నేపాల్ పై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులకు ఆలౌట్ అయింది. వర్షం వల్ల భారత్ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించారు.
దీనిని టీమిండియా వికెట్ కోల్పోకుండా 20.1 ఓవర్లలో చేధించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (74) శుభ్మన్ గిల్ (67*)రాణించారు. ఈ గెలుపుతో భారత్ సూపర్-4కి అర్హత సాధించింది. సూపర్ 4 లో భాగంగా సెప్టెంబర్ 10న మరోసారి భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.