UP : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా విగ్రహానికి ఉన్న ఈటెను దుండగులు దొంగలించారు. హాపూర్ బేస్లో స్పోర్ట్స్ సిటీ ప్రమోషన్ కోసం అధికారులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
నిన్న రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించిన తర్వాత ఈటె చోరీకి గురైనట్లు గుర్తించారు. దీని పై పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితులని పట్టుకుంటామని తెలిపారు.