johnCena: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం… WWE సూపర్ స్పెక్టాకిల్ ఈవెంట్ కోసం సిద్ధమైంది. సాయంత్రం 7.30 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుంది.
అయితే, ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన WWE సూపర్స్టార్ జాన్సీనా (johnCena) ను స్టార్ హీరో కార్తి (Karthi) కలిశారు. ‘సోనీస్పోర్ట్స్’ తరపున ఈవెంట్కు ఆయన గెస్ట్గా వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్టులో జాన్సీనా (johnCena) మీడియాతో ఇండియా అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
Also Read: జాన్సీనా చంద్రయాన్-3 స్పెషల్ పోస్ట్..
గచ్చిబౌలిలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్
ఇన్నాళ్లూ విదేశాల్లో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) ఫైట్ని ఇండియన్ ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్గా చూసేవారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ WWEకి ఫ్యాన్స్ ఉన్నారు. అయితే.. ఇన్నాళ్లు ఈ ఫైట్ను టీవీల్లో చూసిన హైదరాబాద్ అభిమానులకు ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశం ఇప్పుడు లభించింది.
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ పోరు జరగనుంది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్పెక్టాకిల్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది.
జాన్సేనా మొదటి మ్యాచ్
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని పొందిన డబ్ల్యూడబ్ల్యూఈలో ఈ సారి భారత రెజ్లర్లతో పాటు వేర్వేరు దేశాలకు చెందిన ప్రముఖ రెజ్లర్లు 28 మంది బరిలో నిలిచారు.
పలు టైటిళ్లు కొల్లగొట్టిన జాన్సేనా (johnCena) .. సెత్ ఫ్రీకిన్ రోలిన్స్ (seth Freakin Rollins) జతగా బరిలోకి దిగుతున్నాడు. వీరిద్దరు గివోని విన్సీ (Giovanni Vinci), లుడ్విగ్ కైసర్ (Ludwig Kaiser )తో తలపడనున్నారు.
ప్రపంచ ఛాంపియన్ రెజ్లింగ్ జాన్ సినా ( Wrestling John Cena) భారత్ లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. కావున హైదరాబాద్ తో పాటు భారతదేశంలోని ఇతర నగరాల నుండి కూడా రెజ్లింగ్ ఫ్యాన్స్ ఈ ఫైట్ ను తిలకించేందుకు వస్తున్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా సూపర్ స్టార్ స్పెక్టకిల్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో జాన్ సినా తో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు.