శ్రీలంక యువ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరనా (Matheesha Pathirana) T20 క్రికెట్లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. T20 లో ఐదు ఏళ్లుగా చెక్కు చెదరని రికార్డును పతిరనా చెరిపేశాడు. అఫ్గనిస్థాన్తో బుధవారం జరిగిన ఆఖరి T20 లో పతిరనా రెండు వికెట్లు తీసి ఈ ఘనతను సాధించాడు.
Matheesha Pathirana | శ్రీలంక యువ పేసర్ మతీషా పతిరనా (Matheesha Pathirana) పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐదు ఏండ్లగా చెక్కు చెదరని రికార్డు బద్ధలుకొట్టాడు. బుధవారం అఫ్గనిస్థాన్తో జరిగిన ఆఖరి T20లో పతిరనా రెండు వికెట్లు తీసి, ఒక T20 ద్వైపాక్షిక సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్గా రికార్డు సృష్టించాడు. దాంతో యార్కర్ కింగ్ లసిత్ మలింగ (Lasith Malinga) పేరిట ఉన్న రికార్డు చెరిగి పోయింది.
మలింగ రికార్డు బ్రేక్ చేసిన పతిరనా
ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో పతిరనా 8 వికెట్లు తీసాడు. దాంతో మలింగ రెండో స్థానానికి పడిపోయాడు. 2019లో న్యూజిలాండ్తో జరిగిన మూడు T20ల సిరీస్లో మలింగ 7 వికెట్లు పడగొట్టాడు. దంబుల్లా స్టేడియంలో జరిగిన మూడో T20లో ఆఫ్ఘనిస్థాన్ గెలుపొందింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో కాబూలీ జట్టు 3 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read | మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న IPL 17వ సీజన్..!