హైదరాబాద్ : నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్ టోర్నీలో పాకిస్థాన్ కు అదిరిపోయే ఆరంభం దొరికింది. నిన్న ఉప్పల్ స్టేడియంలో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో పసికూన నెదర్లాండ్స్ (Netherlands)పై పాక్ ఘన విజయం సాధించింది.
ICC వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన పాకిస్థాన్, నెదర్లాండ్ క్రికెట్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులు చేయగలిగింది. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68), నవాజ్ (39), షాదాబ్ (32) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్సమెన్ అందరు విఫలమయ్యారు.
నెదర్లాండ్స్ అల్ రౌండర్ బాస్ డి లీడ్ నాలుగు వికెట్లతో పాక్ జట్టుని దెబ్బతీశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ (Netherlands) 41 ఓవర్లలో 205 రన్స్కు అన్ని వికెట్లని కోల్పోయింది. నెదర్లాండ్స్ పై 81 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
నెదర్లాండ్స్ ఆల్ రౌండర్ బాస్ డి లీడ్ (67), విక్రమ్జిత్ సింగ్ (52) అర్ధసెంచరీలతో రాణించిన జట్టును గెలిపించలేకపోయారు. పాకిస్థాన్ బౌలర్లలో స్టార్ పేసర్ హరీస్ రౌఫ్ 3వికెట్లతో, హసన్ అలీ రెండు . వికెట్లతో సత్తా చాటారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని పాకిస్థాన్ బ్యాట్సమెన్ సౌద్ షకీల్ దక్కించుకున్నాడు.