వరల్డ్ కప్ 2023 త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్కు బీసీసీఐ సెక్రటరీ జై షా గోల్డెన్ టికెట్ను అందజేశారు. గోల్డెన్ టికెట్ అందుకున్న రెండో వ్యక్తిగా Sachin.
అక్టోబర్ 5న భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ మ్యాచ్లను వీక్షించేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు.
దీంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ చీఫ్ సెక్రటరీ జై షా మాస్టర్ బ్లాస్టర్ Sachin టెండుల్కర్ను కలిశారు.
సచిన్కు వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ను అందజేశారు. గోల్డెన్ టికెట్ పొందిన వారికి వరల్డ్ కప్ మ్యాచ్లను చూసేందుకు వీఐపీ యాక్సెస్ ఉంటుంది.
భారత దిగ్గజాలను వరల్డ్ కప్ చూసేందుకు ఆహ్వానించడం కోసం బీసీసీఐ గోల్డెన్ టికెట్లను అందజేస్తోంది. సచిన్ కంటే ముందు ఈ గోల్డెన్ టికెట్ పొందిన వ్యక్తి బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి BCCI అంద చేసింది.
ఈ గోల్డెన్ టికెట్ పొందిన వ్యక్తులు జరగబోయే వరల్డ్ కప్ అన్ని మ్యాచ్ లని స్టేడియం లో VIP కేటగిరిలో కూర్చొని చూడవచ్చు.
రాబోయే ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఉత్సాహంతో ఫీవర్ పిచ్కు చేరుకోవడంతో గోల్డెన్ టికెట్ ఫర్ ఇండియా ఐకాన్స్ కార్యక్రమం మరింత పెద్దదిగా మరింత విస్తృతంగా మారుతుందని భావిస్తున్నారు.
అక్టోబర్ 5న ప్రారంభం కానున్న మెగా వరల్డ్ కప్ టోర్నీలో పది జట్లు తలపడనున్నాయి. పది వేదికల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి.
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియంలో ఆరంభ మ్యాచ్తో పాటు ఫైనల్ మ్యాచ్ ఆతిధ్యం ఇవ్వనుంది. 46 రోజులపాటు జరిగే 48 మ్యాచ్లు క్రికెట్ అభిమానులకుఆనందాన్ని పంచనున్నాయి.
ఈ సారి వరల్డ్ కప్ ఎలాగైనా సాదించాలనుకుంటున్న భారత జట్టుకు భారత్ లో ప్రపంచ కప్ జరగనుండటం కలిసి వచ్చే అంశం. క్రికెట్ అభిమానులు ఈ సారి భారత్ జట్టు వరల్డ్ కప్ సాధించాలని కోరుకుంటున్నారు.