Ranchi Test | రాంచీ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 353 పరుగులకు ఆలౌటవ్వగా… అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ ఇంకా 134 పరుగులు వెనుకబడి వుంది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ధ్రువ్ జురెల్ 30, కుల్దీప్ యాదవ్ 17 పరుగులతో క్రీజులో వున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని టీమ్ ఇండియాను దెబ్బకొట్టారు. షోయబ్ బషీర్ 4 వికెట్లు, టామ్ హార్ట్లీ 2 వికెట్లు తీశారు. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ 1 వికెట్ పడగొట్టాడు.
భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 73 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు. కేవలం 2 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ కావడం టీమ్ ఇండియా ఇన్నింగ్స్ పై ప్రభావం చూపింది.
Also Read | రాంచీ టెస్ట్ మొదటి ఇనింగ్స్ లో 353 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్