Uppal Stadium | IPL క్రికెట్ టోర్నీ కొత్త సీజన్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుండడంతో క్రికెట్ అభిమానుల్లో సందడి నెలకొంది. గత ఏడాది మాదిరిగానే మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. సన్రైజర్స్ యంగ్ టీమ్తో బరిలోకి దిగుతోంది, అద్భుతాలు చేయడానికి రెడీ అంటోంది.
Uppal Stadium | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) క్రికెట్ సంబరం శుక్రవారం(మార్చి 22) నుంచి ప్రారంభం కానుంది. తొలి దశ టోర్నీ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం)లో కొన్ని మ్యాచ్లు జరగనున్నాయి. నగరంలో మ్యాచ్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు పోలీసులు ఇటీవల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మ్యాచ్లు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. IPL తొలి దశ షెడ్యూల్ ప్రకారం నగరంలో రెండు మ్యాచ్లు జరగనున్నాయి.
- సన్రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్
- సన్రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్
తొలి మ్యాచ్ సన్రైజర్స్ హైదరాబాద్ VS ముంబై ఇండియన్స్ మార్చి 27న జరగనుంది. హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఏప్రిల్ 5న రెండో మ్యాచ్ ఉంటుంది. హైదరాబాద్లోని రెండు IPL మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలో జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల కారణంగా IPL రెండవ దశను భారతదేశం నుండి తరలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా పలు ప్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్పోర్ట్లను సేకరించాయి. అయితే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) వర్గాలు మాత్రం లీగ్ భారత్లో మాత్రమే జరుగుతుందని పేర్కొంది. లీగ్లో మొత్తం 10 జట్లు ఆడబోతున్నాయి. IPL మ్యాచ్లు హైదరాబాద్తో సహా వివిధ భారతీయ నగరాల్లో జరగనున్నాయి.
Also Read | RCB Women | ఢిల్లీ క్యాపిటల్స్ ను కుప్పకూల్చిన RCB అమ్మాయిలు