హైదరాబాద్: తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచినా బోనాల పండుగ గత నెలలో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. బోనాలకు తెలంగాణ ప్రభుత్వం జూలై 17 సెలవు ప్రకటించింది.
హిందూ క్యాలెండర్ ప్రకారం మహంకాళి అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు, బోనాలు ఆషాడ మాసంతో మొదలవుతాయి. భక్తులు, ముఖ్యంగా మహిళలు ప్రత్యేకంగా అలంకరించిన కుండలలో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.
ప్రతి ఏటా హైదరాబాద్లో నెలరోజుల పాటు మూడు దశల్లో బోనాల పండుగ ఉత్సవాలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు ముగిశాయి. బోనాల పండుగకు ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.
150 సంవత్సరాల క్రితం పెద్ద కలరా వ్యాప్తి తరువాత ఈ పండుగను మొదటిసారి జరుపుకున్నారని సాధారణంగా నమ్ముతారు. మహంకాళి కోపం వల్లనే ఈ మహమ్మారి వచ్చిందని ప్రజలు నమ్మి ఆమెను శాంతింపజేయడానికి బోనాలు సమర్పించడం ప్రారంభించారు అని ఆలయ పూజారి తెలిపారు.