Home   »  Telangana Elections 2023   »   ఎన్నికల వేళ కల్వకుంట్ల హిమాన్షు ట్వీట్!

ఎన్నికల వేళ కల్వకుంట్ల హిమాన్షు ట్వీట్!

schedule sirisha

తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా సీఎం కేసీఆర్ మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు (Kalvakuntla Himanshu Rao) ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

Kalvakuntla Himanshu tweet at the time of election!

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు (Kalvakuntla Himanshu Rao) భావోద్వేగ ట్వీట్ ని చేశారు. తన జీవితంలో మరిచిపోలేని బాధాకరమైన క్షణాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. పీడకల పరిస్థితిని అందరితో పంచుకోవాలని ట్వీట్ చేశాడు. తెలంగాణలో పోలింగ్ జరుగుతుండగా హిమాన్షు చేసిన ట్వీట్ సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

కల్వకుంట్ల హిమాన్షు రావు (Kalvakuntla Himanshu Rao) ఆసక్తికరమైన ట్వీట్

తెలంగాణ దీక్షా దివస్ సందర్భంగా తాతతో తనకున్న అనుబంధాన్ని నెటిజన్లతో ముందు పెట్టాడు. తెలంగాణ కోసం తన తాత నిరాహారదీక్ష చేస్తునప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతోందని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పడం నేను విన్నాను. అది నా జీవితంలో మరిచిపోలేని బాధాకరమైన అనుభవమని హిమాన్షు అన్నారు.

అప్పటికి తన వయసు 4 ఏళ్లేనని, తనకు బాధ కలిగించిన ఘటన తన మనసును చాలా కాలంగా పీడకలలా వెంటాడిందని చెప్పాడు. తనకున్న ఏకైక ప్రాణ స్నేహితుడిని కోల్పోతానేమోనని భయపడ్డానని అన్నాడు.

మా తాత నాకు నేర్పిన ముఖ్యమైన పాఠం ఏమిటంటే, “సత్యం గెలుస్తుంది. న్యాయమే గెలుస్తుంది. భగవంతుడు ఎప్పుడూ ధర్మం వైపు ఉండి రక్షిస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని మళ్లీ నిజం చేస్తాడు.” అంటూ హిమాన్షు కు చెప్పేవాడని అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ హిమాన్షు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

Also read: KTR రక్తదాన కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన EC