Home   »  తెలంగాణ   »   ఆగి ఉన్న కారు, టిప్పర్ ఢీ.. ముగ్గురు మృతి.

ఆగి ఉన్న కారు, టిప్పర్ ఢీ.. ముగ్గురు మృతి.

schedule ranjith
road accident at Andole | A tipper collided with a parked car, three were killed

road accident at Andole | తెలంగాణ, సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో ఆగి ఉన్న కారును టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు, మరో ముగ్గురు గాయపడ్డారు. ఆందోల్  మండలం డాకూర్‌ శివారులో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగిఉన్న కారును వెనుక నుంచి వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. వీరిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేపట్టారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులు జోగిపేటకు చెందినవారు కాగా, మృతులను వాజిద్, హాజీ, ముకర్రంగా గుర్తించారు.

Also Read | సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం