హైదరాబాద్: బస్సును ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో బైక్లోని పెట్రోల్ ట్యాంక్లో మంటలు చెలరేగిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలంలో జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తున్నాడు.
కొల్తూరు వద్ద బైక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న జినోమ్ వ్యాలీలోని ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టింది. బైక్తో పాటు అతను కూడా బస్సు కింద పడి పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగడంతో బైక్, బస్సు రెండూ దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకున్న సంపత్ కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. సంపత్ స్వస్థలం సిద్దిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు. బస్సులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.