Home   »  తెలంగాణ   »   తల్లి కళ్ల ముందే మూడేళ్ల బాలుడి దుర్మరణం. అసలు ఏంజరిగింది..?

తల్లి కళ్ల ముందే మూడేళ్ల బాలుడి దుర్మరణం. అసలు ఏంజరిగింది..?

schedule ranjith

హనుమకొండ: స్కూల్ బస్సు కింద నలిగి మూడేళ్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో పాటు వచ్చిన మూడేళ్ల బాలుడు తల్లి కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. కొత్తకొండకు చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. తండ్రి లేదా తల్లి నిత్యం ఆ బాలుడిని పాఠశాల బస్సు ఎక్కించి స్కూల్‌కు పంపిస్తారు. రోజూ మాదిరిగానే బాలుడి తల్లి తన కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించేందుకు వచ్చింది. వారితో పాటు మూడేళ్ల కుమారుడు (పండు) కూడా వచ్చాడు. తల్లి పెద్ద కుమారుడిని స్కూల్ బస్సు ఎక్కించే హడావుడిలో ఉండగా దీంతో ఆమె చిన్న కుమారుడిని గమనించలేదు. ఇంతలో స్కూల్ బస్సు ముందుకు కదలడంతో వెనుక చక్రం కింద నలిగి బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.