Home   »  తెలంగాణ   »   హైదరాబాద్‌లో పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి..

హైదరాబాద్‌లో పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి..

schedule mounika

హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌(Hyderabad)లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తయింది.

ఆయా నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకులతో హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు.

హైదరాబాద్‌(Hyderabad)లో 75 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలతో పాటు 75 మహిళా పోలింగ్‌ కేంద్రాలు..

హైదరాబాద్‌ జిల్లాలో 75 మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలతో పాటు 75 మహిళా పోలింగ్‌ కేంద్రాలు, 15 వికలాంగులు నిర్వహించే పోలింగ్‌ కేంద్రాలు, 15 యువత నిర్వహించే పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు.

యతీంద్ర ప్రసాద్, సమీర్ వర్మ, కవిత రాము, గాయత్రి కృష్ణన్, దీపాంకర్ సిన్హా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కమిషనర్లు ఉపేందర్ రెడ్డి, శంకరయ్య ఇతర అధికారుల సమక్షంలో ర్యాండమైజేషన్ ప్రక్రియ జరిగింది.