తెలంగాణలో కొత్త రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు గత నెల 26న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్కు ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ప్రాజెక్టుల మౌలిక వసతులు, డబ్లింగ్, మల్టీ ట్రాకింగ్ తదితర పనులకు అనుమతులు ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటల పొడువునా డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు ఈ రైల్వే లైన్ చేపట్టనున్నారు. ఈ మేరకు FLS (ఫైనల్ లొకేషన్ సర్వే) చేపట్టేందుకు రూ.7.40కోట్లు మంజూరు చేసినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది.