Home   »  తెలంగాణ   »   బహుజనులకే రాజ్యాధికారం దక్కాలి : బిఎస్పీ నియోజకవర్గ..

బహుజనులకే రాజ్యాధికారం దక్కాలి : బిఎస్పీ నియోజకవర్గ..

schedule mounika

కోరుట్ల మండలం: జనాభాలో అత్యధికంగా ఉన్న బహుజనులకే రాజ్యాధికారం దక్కాలనీ, బహుజన రాజ్యం వచ్చే దిశగా ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించాలని కోరుట్ల బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి పూదరి నిషాంత్ కార్తికేయ అన్నారు. కోరుట్ల మండలంలోని గుంలాపూర్, వెంకటాపూర్ గ్రామాల్లో శుక్రవారం స్థానిక బిఎస్పీ నాయకులతో కలిసి పర్యటించారు. ప్రజలతో మాట్లాడుతూ ”మన ఓటు మనకే” అనే నినాదంతో ముందుకెళ్ళి రాజ్యాధికారం సాధించుకోవాలి అని తెలిపారు.