Home   »  తెలంగాణ   »   ‘బస్సుల్లో భరోసా’…… మహిళలకు భద్రత….!

‘బస్సుల్లో భరోసా’…… మహిళలకు భద్రత….!

schedule sirisha

సిరిసిల్ల: మహిళా భద్రతకు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వారికి భరోసాగా నిలుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం మరో కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు, స్కూల్ బస్సులో ప్రయాణించే పిల్లల భద్రతకు భరోసా కల్పించేందుకు ‘బస్సుల్లో భరోసా’ పేరుతో ఆర్టీసీ బస్సుల్లో, స్కూల్ బస్సుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా విద్యాశాఖ మంత్రి K.T.రామారావు ప్రారంభించారు. ఈ సీసీ కెమెరాల వల్ల మహిళలపై జరిగే అఘాయిత్యాలు కొంతవరకు అరికట్టవచ్చు అని మంత్రి అన్నారు.