Telangana Lok Sabha seats | తెలంగాణలో ఆదిలాబాద్ మినహా మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థులను BJP అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. మొత్తం 17 స్థానాలకు గానూ 9 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించగా, మిగిలిన ఎనిమిది స్థానాలను మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
Telangana Lok Sabha seats అభ్యర్థుల వివరాలు
DK అరుణ (మహబూబ్నగర్), M రఘునందన్ రావు (మెదక్), సీతారాం నాయక్ (మహబూబాబాద్), జలగం వెంకట్ రావు (ఖమ్మం), శానంపూడి సైదిరెడ్డి (నల్గొండ), గోమాస శ్రీనివాస్ (పెద్దపల్లి), మాజీ డీజీపీ టి కృష్ణ ప్రసాద్ (వరంగల్) పేర్లను అధిష్టానం క్లియర్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరంగల్ లో మరో పార్టీ నుంచి ఓ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో చేరిన పక్షంలో టికెట్ అభ్యర్థిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదిలా ఉంటే ఆదిలాబాద్ స్థానానికి ఎలాగైనా పోటీ చేయాలని సోయం బాపురావు పట్టుదలతో ఉండడంతో ఆ స్థానానికి అభ్యర్థిని నిర్ణయించడం BJP నాయకత్వానికి సవాల్గా మారింది. తనకు టికెట్ ఇవ్వకుంటే BJP అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేస్తానని ఆయన హెచ్చరించారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని KCR కుట్ర పన్నుతున్నారు: రేవంత్