Chalo Nalgonda | తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీసేలా కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ, కేంద్రం నుండి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడేందుకు ఈ నెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ (Chalo Nalgonda) నిర్వహిస్తున్నట్టు BRS అధినేత KCR మంగళవారం తెలిపారు.
ఈ మేరకు BRS పార్టీ కూడా బహిరంగ సభపై ట్విట్టర్ (X) వేదికగా తెలిపింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను KRMBకి అప్పగిస్తూ తీసుకున్న వైఖరిని నిరసిస్తూ ఫిబ్రవరి 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభను నల్గొండలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంత వరకైనా పోరాడుతామని నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తితోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత BRS కార్యకర్తలదేనన్నారు.
Also Read | మానకొండూరులో ఎలుగుబంటి హల్ చల్