Home   »  తెలంగాణ   »   త్వరలో BRS పార్టీ నీటి పోరు యాత్ర.!

త్వరలో BRS పార్టీ నీటి పోరు యాత్ర.!

schedule raju

Neeti Poru Yatra | అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన BRS పార్టీ ఇప్పుడు ప్రజల్లో నమ్మకం పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా నీటి పోరు యాత్ర (Neeti Poru Yatra) కు సిద్ధం అవుతుంది.

Soon BRS party will start Neeti Poru Yatra

విపక్ష BRS పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో దక్షిణ తెలంగాణాలో నాగార్జునసాగర్, ఉత్తర తెలంగాణాలో కాళేశ్వరం నుండి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. యాత్ర ముగింపుసమయంలో హైద్రాబాద్ లో భారీ బహిరంగసభకు BRS ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కృష్ణా జలాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ ఇటీవల నల్గొండలో కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

Neeti Poru Yatra

నల్గొండ సభ విజయవంతం అవడంతో BRS ఇదే ఊపులో నీటి పోరుయాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమౌతోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం BRS పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: హైదరాబాద్‌లో సొరంగ రహదారులకు ప్రతిపాదనలు సిద్ధం..!