Home   »  తెలంగాణ   »   సిద్దిపెట జిల్లాలో దారుణ హత్య

సిద్దిపెట జిల్లాలో దారుణ హత్య

schedule mounika

TS: సిద్ధిపేట జిల్లాలో ఓ మహిళ దారుణంగా హత్య చేయబడింది. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో దారుణం జరిగింది. వెంకటమ్మ (40) అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతంగా హత్య చేశారు. ఆమె గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హంతకుల కోసం గాలిస్తున్నారు. మృతురాలుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతి చెందిన మహిళ ప్లాస్టిక్ సామగ్రి అమ్ముతూ జీవనం కొనసాగించేదని పోలీసులు తెలిపారు.