రెండవ శనివారం, ఆదివారం, స్వాతంత్ర్యం దినోత్సవం.. ఇలా వరుస సెలవులు రావడంతో సొంత ప్రాంతాలకో, విహార యాత్రకో వెళ్తుంటారు. అయితే అలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు అధికారిక వెబ్సైట్లో http://tsrtconline.in టికెట్లను బుకింగ్ చేసుకోగలరని, పూర్తి వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించగలరని ట్వీట్ చేశారు.